Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 14 : కర్నాటక ఫాస్ట్ బౌలర్‌ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా

Webdunia
ఆదివారం, 9 మే 2021 (10:51 IST)
స్వదేశంలో జరుగుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ పోటీలు అర్థాంతరంగా ఆగిపోయాయి. దీనికి కారణం కరోనా వైరస్. ఈ టోర్నీపై కరోనా ప్రభావం పడటంతో నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, కరోనా ప్రభావం మాత్రం జట్టు ఆటగాళ్ళపై కొనసాగుతూనే ఉంది. 
 
టోర్నీ ఆపేసిన నాలుగు రోజుల తర్వాత కొత్తగా ఇద్దరు ఐపీఎల్‌ ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. అందులో ఒకరు కర్ణాటక ఫాస్ట్‌బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కాగా.. మరొకరు న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ టిమ్‌ సీఫర్ట్‌. వీళ్లిద్దరూ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. 
 
ఐపీఎల్‌ ఆగిపోయాక ప్రసిద్ధ్‌ తన స్వస్థలం బెంగళూరుకు బయల్దేరే ముందు చివరగా నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. అయితే అతను విమాన ప్రయాణం ద్వారా బెంగళూరుకు చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాతి రోజే స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నాడు. అందులో పాజిటివ్‌ వచ్చింది.
 
ఇకపతో, తమ దేశ ఆటగాడు టిమ్‌ సీఫర్ట్‌కు పాజిటివ్‌ అని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. అహ్మదాబాద్‌లో ఉన్న సీఫర్ట్‌ను చెన్నైకి తరలించి అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. బబుల్‌లో తొలుత పాజిటివ్‌గా తేలిన వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లు కోల్‌కతా ఆటగాళ్లే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

Asaduddin Owaisi: కొంచెం ఆత్మపరిశీలన చేసుకోండి.. మూర్ఖత్వమే కదా...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments