Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లది ఉక్కులాంటి సంకల్పం : టీమిండియా విజయంపై ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (17:08 IST)
ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఏమాత్రం అచ్చిరాని గబ్బా స్టేడియంలో ఆసీస్‌ను చిత్తు చేయడం అసాధారణ విషయంగా పలువురు భారత క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆసీస్‌పై టీమిండియా సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 
 
ఆస్ట్రేలియాలో భారత జట్టు జైత్రయాత్రను అందరం బాగా ఆస్వాదించామన్నారు. ఈ పర్యటన ఆసాంతం భారత ఆటగాళ్ల తపన, తరగని ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించాయన్నారు. ఉక్కులాంటి సంకల్పం, సడలని దీక్ష కూడా ప్రస్ఫుటమయ్యాయని మోడీ వివరించారు. ఈ సందర్భంగా టీమిండియాకు శుభాభినందనలు తెలియజేస్తున్నానని, భవిష్యత్‌లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.
 
అలాగే, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. అడిలైడ్‌లో జరిగిన టెస్టులో కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు చివరికి 2-1తో టెస్టు సిరీస్ లో టీమిండియానే విజేతగా నిలవడం అపూర్వం అని కొనియాడారు. గొప్పగా పుంజుకోవడం అంటే ఇదేనని ట్వీట్ చేశారు. ఓ మ్యాచ్‌లో 36 పరుగులకే ఆలౌట్ అవడం ఎక్కడ... పెద్ద ఆటగాళ్లు లేకుండానే ఏకంగా సిరీస్‌నే చేజిక్కించుకోవడం ఎక్కడ అంటూ వ్యాఖ్యానించారు. 
 
భారత ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఓ జట్టుగా అసమాన స్ఫూర్తి ప్రదర్శించారని కొనియాడారు. అటు, విపక్షనేత చంద్రబాబునాయుడు స్పందిస్తూ, టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా కంచుకోట గబ్బాలో చిరస్మరణీయ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్నారని ప్రశంసించారు.
 
ఇకపోతే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా టీమిండియా ఘనవిజయం పట్ల ట్వీట్ చేశారు. మరోసారి చరిత్ర సృష్టించారని కొనియాడారు. గబ్బాలో జయకేతనం ఎగురవేశారని, 2-1తో సిరీస్‌ను వశం చేసుకున్నారని తెలిపారు. ఇంకా ఆ మైకంలోనే ఉన్నానని, ఈ రోజును చాన్నాళ్లు గుర్తుంచుకుంటానని అన్నారు. ఎనలేని సంతోషం కలుగుతోందని, టీమిండియా నమోదు చేసిన విజయం పట్ల గర్విస్తున్నానని మహేశ్ పేర్కొన్నారు.
 
కాగా, ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదనపు కట్నం కోసం వేధింపులు - కోడలికి హెచ్.ఐ.వి. ఇంజెక్షన్లు : భర్త - అత్తమామలపై కేసు

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట :18కి చేరిన మృతులు.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా (Video)

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

తర్వాతి కథనం
Show comments