Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు రాకపోతే.. మేమూ రాము.. బీసీసీఐకి పీసీబీ బెదిరింపు (video)

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (11:32 IST)
ముంబై పేలుళ్ల అనంతరం భారత్- పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయాయి. ఇండో-పాక్ సరిహద్దు వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు ప్రపంచ దేశాలు జడుసుకుంటున్నాయి. ఇలా పాకిస్థాన్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టి 15 ఏళ్లయింది. 
 
చివరిసారిగా భారత్ 2005-06 సీజన్‌లో పాకిస్థాన్‌లో పలు మ్యాచ్‌లు ఆడింది. ఉగ్రవాదం కారణంగా ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం బెదిరింపులకు దిగింది. ఈ సెప్టెంబరులో తమ గడ్డపై జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు రావాల్సిందేనని, లేకపోతే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ కు తమ జట్టు రాదని హెచ్చరించింది. 
 
ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీమ్ ఖాన్ వెల్లడించారు. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనకపోతే తాము టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. మరి ఈ బెదిరింపులను బీసీసీఐ ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments