పాకిస్థాన్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్

ఠాగూర్
సోమవారం, 28 అక్టోబరు 2024 (08:41 IST)
పాకిస్థాన్ వన్డే క్రికెట్ జట్టు, టీ20 జట్టు కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంపిక చేసింది. టీ20 ప్రపంచ కప్‌ 2024కు సారథ్యం వహించిన బాబర్ ఆజం గత నెలలో కెప్టెన్సీ నుంచి వైదొలగిన విషయం తెల్సిందే. దీంతో కొత్త కెప్టెన్‌గా రిజ్వాన్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు లాహోర్‌లో జరిగిన మీడియా సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. 
 
మహ్మద్ రిజ్వాన్ తన సీనియారిటీ, ఆటగాడిగా అతని విశ్వసనీయత, దేశవాళీ క్రికెట్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో రాణింపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రిజ్వాన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్టు నఖ్వీ వెల్లడించారు. 
 
కాగా, మూడు వన్డేలు, టీ20 సిరీస్ కోసం పాసిస్థాన్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన‌ కోసం పాక్ జట్టుగా రిజ్వాన్‌ పేరును ఖరారు చేశారు. తన కెప్టెన్సీకి ఈ పర్యటన అగ్నిపరీక్ష వంటిది. రిజ్వాన్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో త్వరలోనే పాక్ గడ్డపై జరుగనున్న చాంపియన్స్ ట్రోపీ మెగా ఈవెంట్ అతనికి అత్యంత కీలకంగా మారనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీరం దాటేసిన మొంథా.. అయినా ముంచేసింది.. భారీ వర్షాలు.. ఏపీలో నలుగురు మృతి (video)

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

తర్వాతి కథనం
Show comments