Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్

ఠాగూర్
సోమవారం, 28 అక్టోబరు 2024 (08:41 IST)
పాకిస్థాన్ వన్డే క్రికెట్ జట్టు, టీ20 జట్టు కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంపిక చేసింది. టీ20 ప్రపంచ కప్‌ 2024కు సారథ్యం వహించిన బాబర్ ఆజం గత నెలలో కెప్టెన్సీ నుంచి వైదొలగిన విషయం తెల్సిందే. దీంతో కొత్త కెప్టెన్‌గా రిజ్వాన్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు లాహోర్‌లో జరిగిన మీడియా సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. 
 
మహ్మద్ రిజ్వాన్ తన సీనియారిటీ, ఆటగాడిగా అతని విశ్వసనీయత, దేశవాళీ క్రికెట్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో రాణింపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రిజ్వాన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్టు నఖ్వీ వెల్లడించారు. 
 
కాగా, మూడు వన్డేలు, టీ20 సిరీస్ కోసం పాసిస్థాన్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన‌ కోసం పాక్ జట్టుగా రిజ్వాన్‌ పేరును ఖరారు చేశారు. తన కెప్టెన్సీకి ఈ పర్యటన అగ్నిపరీక్ష వంటిది. రిజ్వాన్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో త్వరలోనే పాక్ గడ్డపై జరుగనున్న చాంపియన్స్ ట్రోపీ మెగా ఈవెంట్ అతనికి అత్యంత కీలకంగా మారనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR to Hospital Again: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు

KTR: కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు.. ఇచ్చిందెవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments