Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరా?

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (16:20 IST)
వచ్చే నెలలో పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టడం లేదు. పైపెచ్చు.. భారత్ ఆడే మ్యాచ్‌‍లన్నింటినీ తటస్థ వేదికలపై నిర్వహించనున్నారు. ఇదిలావుంటే, ఈ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్ల కోసం తయారు చేసిన జెర్సీలపై పాకిస్థాన్ పేరుతో లోగోను డిజైన్ చేశారు. ఇది భారత్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వివరణ ఇచ్చింది. 
 
ఫిబ్రవరి 19వ తేదీన ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. పాకిస్థాన్ ఆతిథ్య దేశం కాబట్టి... ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు ధరించే జెర్సీలపై టోర్నమెంట్ లోగోతో పాటు పాకిస్థాన్ పేరు కూడా ఉంటుంది. అయితే, తమ జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండడాన్ని బీసీసీఐ వ్యతిరేకించింది. టీమిండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండడాన్ని తాము ఒప్పుకోబోమని స్పష్టం చేసింది.
 
కానీ ఐసీసీ... టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు పాకిస్థాన్ పేరు ఉన్న జెర్సీలు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇది టీమిండియాకు కూడా వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఇందుకు ప్రత్యామ్నాయమే లేదని స్పష్టం చేసింది. ఐసీసీ ఈ విషయంలో తన వైఖరి తేల్చిచెప్పడంతో బీసీసీఐ తన నిర్ణయం మార్చుకుంది. 
 
పాకిస్థాన్ పేరు ఉన్న జెర్సీలు ధరించేందుకు తమకు అభ్యంతరం లేదని వెల్లడించింది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఐసీసీ నియమనిబంధనలను ఎలా ఉన్నా తాము అనుసరిస్తామని తెలిపారు. ఐసీసీ నిర్ణయాన్ని తప్పక పాటిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments