Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 మ్యాచ్: విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్... నిజమా?

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (12:21 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో భాగంగా బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‍‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చేతుల్లో బంతి లేకపోయినప్పటికీ కోహ్లీ థ్రో చేశారు. దీనిపై బంగ్లాదేశ్ జట్టు వికెట్ కీపర్ నూరుల్ హాసన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫీల్డింగ్ అంటూ నూరుల్ హాసన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుణుడు అడ్డుపడటంతో బంగ్లాదేశ్ జట్టు విజయాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. ఏడో ఓవర్‌లో షాట్ రూపంలో తన వైపు బంతి రాగా దాన్ని అర్షదీవ్ సింగ్ పట్టుకుని వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వైపు విసిరాడు. సరిగ్గా వీరి మధఅయలో ఉన్న విరాట్ కోహ్లీ కూడా అర్షదీప్ విసిరిన బంతిని తాను పట్టుకుని విసిరేసినట్టుగా చేతులను థ్రో చేశాడు. దీంతో బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాటర్ అయిన నూరూల్ హాసాన్ తప్పు బట్టాడు. 
 
"మైదానం తడిగా ఉంది. కనుక దీని ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని చూశారు. బాల్ చేతుల్లో లేకపోయినా నకిలీ థ్రో చేసినదుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించాలన్నది నా ఉద్దేశ్యం" అని నూరుల్ హాసన్ కోరుతున్నాడు. మరి ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains Lash Chennai: చెన్నైని కుమ్మేసిన భారీ వర్షాలు.. కరెంట్ తీగను తొక్కి కార్మికురాలు మృతి

Dharmasthala Case: శానిటరీ వర్కర్ చెప్పినవన్నీ అబద్ధాలే.. అరెస్ట్ అయ్యాడు

Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ అపూర్వమైన ఘనత.. ప్రపంచ రికార్డు

Senior citizen: వృద్ధుడిని చంపిన కేర్ టేకర్.. 8 గ్రాముల బంగారును ఎత్తుకెళ్లాడు..

యువకుడిని చుట్టుముట్టి దాడి చేసిన 7 కుక్కల దండు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: కూలిపోతున్న వంతెన మీద స్టిక్ తో మిరాయ్ లో తేజ లుక్

ఎమోషనల్‌గా కట్టి పడేసే బ్యూటీ టీజర్... సెప్టెంబర్ రిలీజ్

Haivan: ప్రియదర్శన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో హైవాన్ ప్రారంభమైంది

వార్ 2 పంపిణీతో బాగా నష్టపోయిన నాగ వంశీ, క్షమించండి అంటూ పోస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

తర్వాతి కథనం
Show comments