Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో వన్డే సిరీస్ : న్యూజిలాండ్‌ జట్టు ఇదే

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (17:01 IST)
స్వదేశంలో పర్యాటక భారత్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్ కోసం సిద్ధమైంది. ఇందుకోసం కివీస్ జట్టును ప్రకటించింది. అయితే, ఈ వన్డే సిరీస్‌కు ముందు కివీస్‌ జాతీయ జట్టులోని సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్లు గాయాలతో భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో అందుబాటులో ఉన్న వారితో జట్టును ప్రకటించారు.
 
కాగా, ఆతిథ్య కివీస్‌, భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ఫిబ్రవరి 5వ తేదీన తొలి వన్డే మ్యాచ్ హామిల్టన్ వేదికగా జరుగనుంది. 14 మంది ఆటగాళ్లతో కూడిన వన్డే జట్టును న్యూజిలాండ్‌ సెలక్టర్లు గురువారం ప్రకటించారు. ఈ వన్డే సిరీస్ ద్వారా కైల్‌ జామిసన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లోకి అరంగేట్రం చేయనుండగా.. స్కాట్‌ కుగెలిన్‌, హమీష్‌ బెనెట్‌ చాలా రోజుల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. 
 
టీమ్‌ సౌథీ పేస్‌ భారాన్ని మోయనున్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, లాకీ ఫర్గుసన్‌, మాట్‌ హెన్రీ గాయాలతో సిరీస్‌కు దూరమయ్యారు. ఆఖరి రెండు టీ20లకు జట్టులో లేని గ్రాండ్‌హోం వన్డే టీమ్‌లో చోటుదక్కించుకున్నాడు. జిమ్నీ నీషమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ ఆల్‌రౌండ్‌ కోటాలో బరిలో దిగనున్నారు. ఇష్‌ సోధీని కేవలం తొలి వన్డే కోసం మాత్రమే ఎంపిక చేశారు. ఈ వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టు వివరాలను పరిశీలిస్తే, 
 
వన్డే జట్టు :
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), హమీశ్‌ బెనెట్‌, టామ్‌ బ్లండెల్‌, కోలిన్‌ గ్రాండ్‌హోం, మార్టిన్‌ గప్తిల్‌, కైల్‌ జామీసన్‌, స్కాట్‌ కుగెలిన్‌, టామ్‌ లాథమ్‌, జిమ్మీ నీషమ్‌, హెన్రీ నికోల్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఇష్‌ సోధీ, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments