Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో వన్డే సిరీస్ : న్యూజిలాండ్‌ జట్టు ఇదే

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (17:01 IST)
స్వదేశంలో పర్యాటక భారత్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్ కోసం సిద్ధమైంది. ఇందుకోసం కివీస్ జట్టును ప్రకటించింది. అయితే, ఈ వన్డే సిరీస్‌కు ముందు కివీస్‌ జాతీయ జట్టులోని సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్లు గాయాలతో భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో అందుబాటులో ఉన్న వారితో జట్టును ప్రకటించారు.
 
కాగా, ఆతిథ్య కివీస్‌, భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ఫిబ్రవరి 5వ తేదీన తొలి వన్డే మ్యాచ్ హామిల్టన్ వేదికగా జరుగనుంది. 14 మంది ఆటగాళ్లతో కూడిన వన్డే జట్టును న్యూజిలాండ్‌ సెలక్టర్లు గురువారం ప్రకటించారు. ఈ వన్డే సిరీస్ ద్వారా కైల్‌ జామిసన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లోకి అరంగేట్రం చేయనుండగా.. స్కాట్‌ కుగెలిన్‌, హమీష్‌ బెనెట్‌ చాలా రోజుల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. 
 
టీమ్‌ సౌథీ పేస్‌ భారాన్ని మోయనున్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, లాకీ ఫర్గుసన్‌, మాట్‌ హెన్రీ గాయాలతో సిరీస్‌కు దూరమయ్యారు. ఆఖరి రెండు టీ20లకు జట్టులో లేని గ్రాండ్‌హోం వన్డే టీమ్‌లో చోటుదక్కించుకున్నాడు. జిమ్నీ నీషమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ ఆల్‌రౌండ్‌ కోటాలో బరిలో దిగనున్నారు. ఇష్‌ సోధీని కేవలం తొలి వన్డే కోసం మాత్రమే ఎంపిక చేశారు. ఈ వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టు వివరాలను పరిశీలిస్తే, 
 
వన్డే జట్టు :
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), హమీశ్‌ బెనెట్‌, టామ్‌ బ్లండెల్‌, కోలిన్‌ గ్రాండ్‌హోం, మార్టిన్‌ గప్తిల్‌, కైల్‌ జామీసన్‌, స్కాట్‌ కుగెలిన్‌, టామ్‌ లాథమ్‌, జిమ్మీ నీషమ్‌, హెన్రీ నికోల్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఇష్‌ సోధీ, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments