Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : సఫారీలకు షాకిచ్చిన డస్ జట్టు

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (09:52 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టుకు డచ్ ఆటగాళ్లు తేరుకోలేని షాకిచ్చారు. మొన్నటికిమొన్న పటిష్టమైన, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ జట్టును ఆప్ఘనిస్తాన్ జట్టు చిత్తుగా ఓడించింది. మంగళవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను నెదర్లాండ్ జట్టు ఓడించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 38 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించి సంచనం సృష్టించారు.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆ తర్వాత 43 ఓవర్లలో 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక సఫారీలు చతికిలబడ్డారు. 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయ్యారు. డచ్ బౌలర్లు సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికా పనిబట్టారు. వాన్ బీక్ 3, వాన్ మీకెరెన్ 2, వాన్ డెర్ మెర్వ్ 2, బాస్ డీ లీడ్ 2, అకెర్ మన్ 1 వికెట్ తీశారు.
 
సౌతాఫ్రికా జట్టులో జట్టులో డికాక్, మార్ క్రమ్, మిల్లర్, బవుమా, డుస్సెన్, క్లాసెన్ వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ ఆరెంజ్ ఆర్మీ ముందు తలవంచక తప్పలేదు. వరల్డ్ కప్‌లో గత రెండు మ్యాచ్‌ల్లో సాధికారికంగా నెగ్గిన సఫారీలు మంగళవారం నెదర్లాండ్స్‌ను ఓ ఆట ఆడుకుంటారని అందరూ భావించారు. కానీ... ఇది క్రికెట్! ఏమైనా జరగొచ్చు అని నిరూపిస్తూ... సఫారీలను డచ్ సేన కుమ్మేసింది. 
 
మిల్లర్ 43, క్లాసెన్ 28, కోట్టీ 22, డికాక్ 20 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో సఫారీలకు పరాభవం తప్పలేదు. మ్యాచ్ ఆఖరులో కేశవ్ మహరాజ్ పోరాడినా ఫలితం లేకపోయింది. కేశవ్ మహరాజ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో ఓవర్లను 43కి కుదించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments