Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : సఫారీలకు షాకిచ్చిన డస్ జట్టు

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (09:52 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టుకు డచ్ ఆటగాళ్లు తేరుకోలేని షాకిచ్చారు. మొన్నటికిమొన్న పటిష్టమైన, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ జట్టును ఆప్ఘనిస్తాన్ జట్టు చిత్తుగా ఓడించింది. మంగళవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను నెదర్లాండ్ జట్టు ఓడించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 38 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించి సంచనం సృష్టించారు.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆ తర్వాత 43 ఓవర్లలో 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక సఫారీలు చతికిలబడ్డారు. 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయ్యారు. డచ్ బౌలర్లు సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికా పనిబట్టారు. వాన్ బీక్ 3, వాన్ మీకెరెన్ 2, వాన్ డెర్ మెర్వ్ 2, బాస్ డీ లీడ్ 2, అకెర్ మన్ 1 వికెట్ తీశారు.
 
సౌతాఫ్రికా జట్టులో జట్టులో డికాక్, మార్ క్రమ్, మిల్లర్, బవుమా, డుస్సెన్, క్లాసెన్ వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ ఆరెంజ్ ఆర్మీ ముందు తలవంచక తప్పలేదు. వరల్డ్ కప్‌లో గత రెండు మ్యాచ్‌ల్లో సాధికారికంగా నెగ్గిన సఫారీలు మంగళవారం నెదర్లాండ్స్‌ను ఓ ఆట ఆడుకుంటారని అందరూ భావించారు. కానీ... ఇది క్రికెట్! ఏమైనా జరగొచ్చు అని నిరూపిస్తూ... సఫారీలను డచ్ సేన కుమ్మేసింది. 
 
మిల్లర్ 43, క్లాసెన్ 28, కోట్టీ 22, డికాక్ 20 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో సఫారీలకు పరాభవం తప్పలేదు. మ్యాచ్ ఆఖరులో కేశవ్ మహరాజ్ పోరాడినా ఫలితం లేకపోయింది. కేశవ్ మహరాజ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో ఓవర్లను 43కి కుదించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ వద్ద బాలీవుడ్ నటుడు సోనూసూద్..(Video Viral)

పెద్దిరెడ్డి ఇలాకాలో జారుకుంటున్న వైకాపా నేతలు.. టీడీపీలో చేరేందుకు సిద్ధం!!

పాము గొంతులో దగ్గు సిరప్ బాటిల్.. కాపాడిన టీమ్‌కు ప్రశంసలు

వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు!!

ఢిల్లీలో చంద్రబాబు.. అమరావతికి 45 కేంద్ర కార్యాలయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

మిడిల్ క్లాస్ కష్టాలు, ఎమోషన్స్ తో సారంగదరియా’ ట్రైలర్ - ఆవిష్కరించిన హీరో నిఖిల్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments