Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో ప్రత్యక్షమైన హార్దిక్ పాండ్యా మాజీ భార్య!

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (11:08 IST)
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ ఉన్నట్టుండి ముంబైలో ప్రత్యక్షం కావడం ఇపుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. 2020 మే 31న కరోనా సమయంలో హర్ధిక్ పాండ్య, నటాషా ప్రేమ వివాహం చేసుకోగా, వారికి అదే ఏడాది బాలుడు (అగస్త్య) పుట్టాడు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తాము విడిపోవాలని పరస్పరం
నిర్ణయించుకున్నామని ఇద్దరూ ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే కో పేరెంట్స్‌గా ఆగస్త్యకి తాము చేయాల్సింది అంతా చేస్తామని పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో పాండ్యాతో విడిపోయినట్లు ప్రకటించిన తర్వాత అగస్త్యను తీసుకుని నటాషా తన స్వదేశం సెర్బియా వెళ్లిపోయింది. అక్కడే కుమారుడి నాలుగో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంది. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
మరో వైపు క్రికెట్ కెరీర్‌‌లో బిజీగా ఉన్న హార్దిక్ పాండ్యా తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ తరుణంలో పాండ్యా మాజీ భార్య నటాషా మళ్లీ ముంబైకి చేరుకోవడం ఇపుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. తన ముంబై పర్యటనకు సంబంధించిన ఫోటోలను నటాషా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. అయితే ఇందులో కుమారుడు అగస్త్య కనిపించలేదు. నటాషా ముంబైకి ఎందుకు తిరిగి వచ్చింది అనే దానిపై ఇంత వరకూ క్లారిటీ లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments