Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదానంలో అభిమానిని ఆటపట్టించిన ఎమ్మెస్ ధోనీ...(Video)

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (10:42 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 40 ఏళ్లలోనూ సరికొత్త రికార్డులతో అదరగొడుతున్నాడు. టీమిండియాను ప్రతీ మ్యాచ్‌లోనూ గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తాడు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో టీమిండియా క్రికెటర్లకు మెలకువలు చెప్తూ ముందుకు నడుపుతున్నాడు. 


ఇలా టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో ఉన్నత స్థానంలో నిలబెట్టిన ధోనీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అలాంటి ధోనీని కలిసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. ధోనీ ఎక్కడైనా కనిపించాడో.. అక్కడ ఆయన పాదాలపై పడిపోవడం సెల్ఫీలు దిగడం మామూలైపోయింది.
 
క్రికెట్ స్టేడియంలోనూ ఇలాంటి ఘటనలు జరిగివున్నాయి. మైదానంలో వచ్చేసే ధోనీ ఫ్యాన్స్ ఆయన కాలిపై పడటం వంటివి జరిగిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం తాజాగా అలా మైదానంలోకి ధోనీని చూసేందుకు వచ్చిన ఓ అభిమానిని కూల్ కెప్టెన్ ఆటపట్టించాడు. రెండో వన్డే రెండో సెషన్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

సెక్యూరిటీని దాటుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చిన అభిమానిని వికెట్ల వరకు పరుగున వెళ్లి అక్కడ చెయ్యి కలిపాడు. అలా కాసేపు అభిమానిని పరిగెత్తింపజేశాడు. 
 
నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే సందర్భంగా జరిగిన ఈ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రెండో సెషన్‌లో భారత్‌ జట్టు ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి వెళుతోంది. ఆ సమయంలో భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. ధోనీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.
 
ఆ అభిమాని నుంచి తప్పించుకునేందుకు ధోనీ మైదానంలో పరుగందుకున్నాడు. అయినా ఆ వీరాభిమాని వదలకుండా ధోనీ వెంటపడడంతో చివరికి వికెట్ల వద్దకు వెళ్లి ఆగిపోయాడు.


వచ్చిన అభిమానికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో అతను ఆనందంతో ముందు కాలిపై పడ్డాడు. ఆ తర్వాత ధోనీని ఆలింగనం చేసుకున్నాడు. ఇలా అభిమానిని కాసేపు పరుగెత్తి ఆటపట్టించిన ధోనీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

ప్రేమ పేరుతో మైనర్ బాలికలపై వేధింపులు.. అక్కాచెల్లెళ్లను అలా వాడుకోవాలనుకున్నాడు..

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

తర్వాతి కథనం
Show comments