ఇక చాలు.. విమర్శలతో జట్టుకు దూరం.. కాశ్మీర్‌లో ధోనీ ఉద్యోగం..

Webdunia
గురువారం, 25 జులై 2019 (16:47 IST)
ప్రపంచ కప్‌లో రాణించలేకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఆర్మీ బెటాలియన్‌తో కలిశాడు. భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్‌ విభాగంలో తన రెండు నెలల శిక్షణను ప్రారంభించాడు. 
 
ధోనీ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. క‌ాశ్మీర్‌లో ఉద్యోగం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు. కాశ్మీర్‌‍లో వున్న విక్టర్ ఫోర్స్‌తో ధోనీ కలవనున్నాడు. అక్కడ పారాచూట్ రిజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీలను ధోనీ నిర్వర్తించనున్నాడు. భద్రతా దళాలతో 15 రోజుల పాటు ధోనీ గడపనున్నాడు.
 
కాగా పారామిలటరీ రిజిమెంట్‌లో సేవలు అందించేందుకు రెండు నెలల పాటు భారత జట్టుకు అందుబాటులో వుండనని బీసీసీఐకి ధోనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌కు ధోనీ దూరంగా ఉన్నాడు. అతను స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. అయితే టెస్ట్‌లకు వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నాయ కీపర్‌గా ఎంపిక చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments