Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. యువీ బ్యాటింగ్ ఆర్డర్‌ను అందుకే మార్పించా: ధోనీ

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (17:52 IST)
టీమిండియా 2011లో వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై ప్రపంచ కప్ కొట్టిన తరుణాన్ని అప్పటి కెప్టెన్ ధోనీ గుర్తు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఆ జట్టులోకి రావాల్సిన స్థానానికి తాను రావడంపై ధోనీ క్లారిటీ ఇచ్చాడు. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమని చెప్పాడు. 
 
శ్రీలంక బౌలర్లలో చాలామంది చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఐపీఎల్‌లో బౌలింగ్ చేసినవారే. ఆ అనుభవంతో ధీటుగా ఎదుర్కోవచ్చుననే ఆలోచనతో.. మేనెజ్‌మెంట్‌కు చెప్పి యువరాజ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయమన్నానని.. అందుకు వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పాడు. 
 
లంకేయులతో ఐపీఎల్ ఆడిన అనుభవాన్ని పెట్టే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేశానని చెప్పాడు. శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో ధోనీ ఫినిషింగ్ షాట్ కొట్టి 3 దశాబ్ధాల తర్వాత భారత్‌కు వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

తర్వాతి కథనం
Show comments