Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒకే ఒక్కడు'.. "సరిలేరు నీకెవ్వరు" అంటున్న నెటిజన్లు

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (12:21 IST)
భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసి కేవలం సింగిల్‌ లైన్‌తో తన ఉద్దేశం తెలిపాడు. ఈ లైన్ చూసిన క్రికెట్ అభిమానులు, క్రికెట్ పండితులు, క్రికెటర్లు, రాజకీయ నేతలు ఆశ్చర్యానికు లోనయ్యారు. 
 
అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్‌గా జట్టుకు ఒక ఐసీసీ ట్రోఫీ అందిస్తే గొప్ప. అలాంటిది ఏకంగా మూడు కప్‌లు సాధించిపెడితే అది అనన్య సామాన్యమైన ఘనత. సారథిగా ధోనీ అలాంటి ఘనతే అందుకున్నాడు. అతడి నాయకత్వంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలు కైవసం చేసుకుంది. 
 
ప్రపంచ క్రికెట్‌లో ముచ్చటగా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు. మూడు ట్రోఫీల్లో మొదటిది టీ20 ప్రపంచ కప్‌. పొట్టి వరల్డ్‌ కప్‌ తొలిసారి 2007లో సౌతాఫ్రికాలో జరిగింది. అప్పుడే భారత్‌ పగ్గాలు చేపట్టిన మహీ..ఆ టోర్నీలో జట్టును జగజ్జేతగా నిలిపాడు. టైటిల్‌ ఫైట్‌లో దాయాది పాకిస్థాన్‌ను ఓడించడంతో ఆ ట్రోఫీ టీమిండియాకు మరింత చిరస్మరణీయమైంది. 
 
ఇక రెండోది..2011 వన్డే ప్రపంచ కప్‌. భారత్‌ ఆతిథ్యమిచ్చిన ఆ మెగా టోర్నీలో జట్టును ముందుండి నడిపించాడు మహీ. వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో ఫైనల్లో తనదైన శైలిలో సిక్సర్‌ కొట్టిన ధోనీ (91 నాటౌట్‌) జట్టుకు మరో అద్వితీయ విజయాన్ని కట్టబెట్టాడు. చివరగా 2013 చాంపియన్స్‌ ట్రోఫీతో మహీ సారథ్యంలో టీమిండియా ఖాతాలో మూడో ఐసీసీ కప్‌ చేరింది. 
 
అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లోనేకాదు.. ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా ధోనీది తిరుగులేని ముద్ర. అతడి నాయకత్వంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2010, 2011, 2018 సంవత్సరాల్లో మూడుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచింది. అలా క్రికెట్ చరిత్రలో ధోనీ అధ్యాయం ముగిసిపోయింది. 

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments