Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుపటి స్థాయిలో ఫిట్‌గా లేనంటున్న జార్ఖండ్ డైనమెట్!!

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (15:41 IST)
తన ఫిట్నెస్‌పై భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో ఉన్నట్టుగా ఫిట్నెస్‌గా లేనని చెప్పారు. అయితే, ఫిట్‌గా ఉండేందుకు నిర్దిష్టమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. 
 
ఈ యేడాది జరుగనున్న ఐపీఎల్ 2025లో ధోనీ ఆడనున్నారు. ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్ల ధరకు అదనపు ఆటగాడిగా ఎంపిక కొనుగోలు చేసింది. ఈ యేడాది మార్చిలో మెగా టోర్నీ ఆరంభంకానున్న నేపథ్యంలో తన ఫిట్నెస్పై కీలక అప్డేట్ ఇచ్చాడు.
 
తాను మునుపటి స్థాయిలో ఫిట్‌గా లేనని, అయితే స్పోర్ట్స్ ఆడడానికి అవసరమైన ఫిట్నెస్‌లో మాత్రం ఉన్నట్టు వ్యాఖ్యానించాడు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఫిట్‌‍గా ఉండేందుకు తాను చేయాల్సిన నిర్దిష్టమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించాడు. 
 
"మేమేమీ ఫాస్ట్ బౌలర్లం కాదు. కాబట్టి, అంత తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు" అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు టైర్ల తయారీ కంపెనీ 'యూరోగ్రిప్ టైర్స్' నిర్వహించిన 'ట్రెడ్ టాక్స్' ఎపిసోడ్‌లో ధోనీ మాట్లాడాడు.
 
తినే ఆహారం, జిమ్‌కు వెళ్లడం ఫిట్‌గా ఉండడానికి దోహదపడతాయని ధోనీ పేర్కొన్నాడు. ఏదో ఒక ఆట ఆడుతుంటే ఫిట్‌గా ఉంటామని, అందుకే సమయం దొరికినప్పుడల్లా విభిన్నమైన క్రీడలను ఆడాలనుకుంటున్నట్టు చెప్పాడు. కాగా, ఎంఎస్ ధోనీ వయసు 43 సంవత్సరాలు దాటిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments