పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై కరోనా పంజా.. 10మంది క్రికెటర్లకు పాజిటివ్

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (19:46 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై కరోనా పంజా విసిరింది. పాకిస్తాన్ మాజీ క్రికెట్ షాపిద్ అఫ్రిది ఇప్పటికే కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ పర్యటనకు ముందే పాకిస్థాన్ జట్టుకు గట్టిదెబ్బ తగిలినట్లైంది. ఆటగాళ్లంతా వరుసగా కోవిడ్ బారినపడుతున్నారు. సోమవారం ముగ్గురు కరోనా బారినపడ్డారు. 
 
తాజాగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది. సోమవారం హైదర్ అలీ, హారిస్ రవుఫ్, షాదబ్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఇవాళ ఫకార్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కషీఫ్ భట్టి, మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ హస్నేన్, మహమ్మద్ రిజ్వాన్, వాహబ్ రియాజ్‌కు కూడా కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయింది. ఫలితంగా 10మంది క్రికెటర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కానీ కరోనా సోకిన పాకిస్థాన్ క్రికెటర్లలో ఎలాంటి కరోనా లక్షణాల్లేవ్. 
 
త్వరలోనే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో జట్టు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేసింది పీసీబీ. ఈ పరీక్షల్లో ఇప్పటి వరకు 10మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన పీసీబీ అధికారులు వారితో సన్నిహితంగా మెలిగిన వివరాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments