Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం... బంగ్లా - శ్రీలంక మ్యాచ్ డౌట్?

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (08:25 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో సోమవారం ఐసీసీ వన్డే ప్రపచం కప్ టోర్నీలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ నిర్వహణ అనుమానాస్పదంగా మారింది. ఇప్పటికే శ్రీలంక జట్టు తన ప్రాక్టీస్ మ్యాచ్‌ను రద్దు చేసుకుంది. బంగ్లా ఆటగాళ్లు మాత్రం మూతికి మాస్కులు వేసుకుని ప్రాక్టీస్ చేశారు. పరిస్థితిలో మార్పు రాకుంటే మాత్రం ఈ మ్యాచ్ రద్దు చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. 
 
ఢిల్లీలో ఒక్కసారిగా కాలుష్యం పెరిగిపోయింది. ఈ కోరల్లో చిక్కుకుని ఢిల్లీ వాసులు తల్లడిల్లిపోతున్నారు. తమ గృహాలను వీడి బయటకు రాలేకపోతున్నారు. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. దీంతో సోమవారం జరగాల్సిన బంగ్లాదేశ్ - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాలుష్యం భయంతో ఈ రెండు జట్లూ ఇప్పటికే తమ ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్నాయి. లంకేయులు శనివారం పూర్తిగా ఇండోర్స్‌కే పరిమితమయ్యారు. బంగ్లాదేశ్ కుర్రోళ్లు మాత్రం శనివారం సాయంత్రం ముఖానికి మాస్కులు ధరించి ప్రాక్టీస్ చేశారు.
 
అదేసమయంలో ఢిల్లీలో రోజు రోజుకూ కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే, మ్యాచ్‌ నిర్వహణపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. పరిస్థిని అంచనా వేసేందుకు ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ డాక్టర్ రణదీప్ గులేరియీ సేవలను బీసీసీఐ ఉపయోగించుకుంటుంది. 
 
నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం మైదానం, వాతావరణం లేదంటే మరే ఇతర పరిస్థితులైనా ప్రమాదకరంగా ఉన్నాయని ఫీల్డ్ అంపైర్లు భావిస్తే కనుక ఆటను నిలిపేయొచ్చు. లేదంటే ప్రారంభాన్ని రద్దు చేయొచ్చు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌పై మరికొన్ని గంటల్లో ఐసీసీ, బీసీసీఐ కలిసి ఓ సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments