Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్డ్ టెస్ట్ మ్యాచ్ : విజయం దిశగా సౌతాఫ్రికా

జోహన్స్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న ద‌క్షిణాఫ్రికా, భారత్ చివ‌రి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లోభారత్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సఫారీల ముంగిట 241 పరుగుల విజయ లక్ష్

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (17:58 IST)
జోహన్స్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న ద‌క్షిణాఫ్రికా, భారత్ చివ‌రి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లోభారత్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సఫారీల ముంగిట 241 పరుగుల విజయ లక్ష్యంగా నిర్ధేసించింది. 
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో భోజనవిరామ సమయానికి ఆమ్లా, ఎల్గర్‌లు కలిసి పటిష్టమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో 241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు మూడో రోజే ఓపెనర్ మార్క్‌రం వికెట్ కోల్పోయింది. 
 
నాలుగో రోజు 17/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆమ్లా, ఎల్గర్‌ కలిసి రెండో వికెట్‌కి 64 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించారు. భారత పేస్‌ని ధీటుగా, వికెట్లు కాపాడుకుంటూ.. పరుగులు రాబట్టేందుకు వీరిద్దరు ప్రయత్నం చేస్తున్నారు. 
 
మరోవైపు గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో సఫారీల వికెట్‌లు పడగొట్టేందుకు భారత బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. దీంతో భోజన విరామ సమయానికి దక్షిణాఫ్రికా 1 వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. భారత్‌పై విజయం సాధించేందుకు దక్షిణాఫ్రికా ఇంకా 172 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో ఆమ్లా(27), ఎల్గర్(29) ఉన్నారు. 
 
241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. స్కోరు 17 ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 42గా ఉంది. మార్క్‌రమ్ 4 పరుగులకే షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్ 17, హషిమ్ ఆమ్లా 12 పరుగులతో ఉన్నారు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులకి ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా గెలవాలంటే మరో 199 పరుగులు చేయాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments