Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ టీ-20: నేపాల్ 21 పరుగులే.. 99 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం

ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 టోర్నీలో భారత మహిళా జట్టు గెలుపును నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్‌... ఐదింట్లోను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా నేపాల

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (14:37 IST)
ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 టోర్నీలో భారత మహిళా జట్టు గెలుపును నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్‌... ఐదింట్లోను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా నేపాల్‌తో తలపడిన భారత మహిళా క్రికెట్ జట్టు 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు సాధించింది. 
 
భారత మహిళా జట్టులో శిఖా పాండే అద్భుత ఇన్నింగ్స్ ద్వారా 39 పరుగులు సాధించింది. ఫలితంగా 121 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్, భారత వుమెన్స్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. దీంతో నేపాలీ వుమెన్స్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 16.3ఓవర్లలో నేపాల్‌ కేవలం 21పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్ల ధాటికి నేపాల్‌ క్రీడాకారులందరూ సింగిల్‌ డిజిట్‌కే ఔటయ్యారు.
 
ఈ మ్యాచ్‌లో సరిత మగర్‌ అనే క్రీడాకారిణి చేసిన ఆరు పరుగులే వ్యక్తిగతంగా నేపాల్‌ క్రీడాకారిణుల్లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. నలుగురు క్రీడాకారిణులు ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. భారత్‌ తరఫున పూనమ్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టగా, మేఘన, పాటిల్‌ చెరో రెండు వికెట్లు, పాండే, జోషి, బిస్తా తలో వికెట్‌ తీసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

తర్వాతి కథనం
Show comments