Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి : శ్రీలంక క్రికెటర్ అరెస్టు

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (15:33 IST)
ఓ రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు చనిపోయిన ఘటనలో శ్రీలంక యువ క్రికెటర్‌ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఆ క్రికెటర్ పేరు కుశాల్ మెండీస్ (25). కొలంబో శివారు ప్రాంతం పనాదురాలో ఓ వృద్ధుడు (64) సైకిల్‌పై వెళుతుండగా, అటుగా కారులో వచ్చిన కుశాల్ మెండిస్ ఆ వృద్ధుడి సైకిల్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వృద్ధుడు చనిపోయాడు. 
 
ఈ ఘటన ఆదివారం వేకువజామున జరిగింది. కుశాల్ మెండిస్ గత కొంతకాలంగా శ్రీలంక జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటివరకు 44 టెస్టులు, 76 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే శ్రీలంకలో లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సాధన చేసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి కారకుడైనట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం మెండిస్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments