Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ 15 సీజన్ పోటీలు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (11:00 IST)
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్నాయి. మార్చి నెలాఖరులో ఈ పోటీలను నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఐపీఎల్ 15వ సీజన్ పోటీలను స్వదేశంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. 
 
ఐపీఎల్ 15వ సీజన పోటీలను స్వదేశంలోనే నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కరోనా కేసులు అదుపులోకి రానిపక్షంలో లీగ్‌ను మరో దేశానికి తరలించక తప్పదన్నారు. స్వదేశంలోనే ఈ పోటీలు జరగాలని అన్ని ఫ్రాంచైజల యాజమానులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. 
 
ఒక వేళ స్వదేశంలో ఈ పోటీలు నిర్వహిస్తే మాత్రం అన్ని ఫ్రాంచైజీలు కోరుకున్నట్టుగా వాటివాటి సొంత నగరాల్లో ఈ మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యంకాకపోవచ్చని తెలిపారు. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆటగాళ్ళ భద్రత ముఖ్యమన్నారు. 
 
అందువల్ల మహారాష్ట్రలోని ముంబై, పూణెలలో పలు మైదానాలు ఉన్నందున, విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండానే కొత్త సీజన్‌లో పోటీలును ఆ మైదానాల్లోనే నిర్వహిచేలా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

తర్వాతి కథనం
Show comments