క్రికెట్ బెట్టింగ్ యాప్.. క్షౌరశాల నిర్వాహకుడికి కోటి రూపాయలు

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (11:49 IST)
క్రికెట్ బెట్టింగ్ ఆ క్షౌరశాల నిర్వాహకుడికి అదృష్టం తలుపు తట్టింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ అయిన 'డ్రీమ్-11'లో అశోక్ బెట్టింగ్ కాస్తూ గత కొంతకాలంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం అదృష్టం అతడిని వరించింది. కోటి రూపాయలు మోసుకొచ్చింది. అంత సొమ్ము గెలుచుకునే సరికి అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
 
వివరాల్లోకి వెళితే..నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ ఓ సెలూన్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ అంటే తొలి నుంచీ ఆసక్తి ఉన్న అతడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 'డ్రీమ్-11'లో బెట్టింగ్ కాయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు.
 
ఈ క్రమంలో ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌పై బెట్టింగ్ కట్టిన అశోక్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. విషయం తెలిసి అశోక్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అయితే, కోటి రూపాయలు వచ్చినంత మాత్రాన వృత్తిని వదులుకోబోనని చెప్పుకొచ్చాడు. వచ్చిన సొమ్ముతో తొలుత అప్పులు తీర్చి, ఆపై ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments