Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వదేశంలో ఐపీఎల్ : పూర్తి షెడ్యూల్‌ విడుదల

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (15:03 IST)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత సీజన్ ఐపీఎల్ పోటీలను యూఏఈ గడ్డపై నిర్వహించిన బీసీసీఐ తాజా సీజన్‌ను స్వదేశంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం పూర్తి షెడ్యూల్ విడదల చేసింది. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్ మే 30న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. 
 
చెన్నైలో జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇక, ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా అవతరించిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్‌కు వేదికగా నిలవనుంది. ఈ భారీ స్టేడియంలో ఐపీఎల్ పోటీలు జరగడం ఇదే తొలిసారి.
 
కాగా, కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 6 వేదికల్లోనే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, లీగ్ దశ పోటీలకు ప్రేక్షకులను అనుమతించకుండా, ప్లే ఆఫ్ దశ నుంచి మైదానాలకు ప్రేక్షకులను అనుమతిస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments