Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే యేడాది నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంపు

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (10:56 IST)
వచ్చే యేడాది జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో మ్యాచ్‌ల సంఖ్య పెంచనున్నారు. ఐపీఎల్ 16వ సీజన్ కోసం నిర్వహించిన బిడ్డింగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా, మీడియా హక్కులు రికార్డు స్థాయి ధర పలికింది. దీంతో వచ్చే సీజన్‌ నుంచి మ్యాచ్‌ల సంఖ్యను పెంచనున్నారు. 
 
ఐపీఎల్‌లో ఓ సీజన్ నిడివి రెండున్నర నెలలు ఉండేలా ఐసీసీ షెడ్యూల్‌లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. ఆ లెక్కన ఓ ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. పైగా వచ్చే ఐపీఎల్ సీజన్ రెండున్నర నెలలు జరిగే అంశాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా నిర్ధారించారు. 
 
ఈ మేరకు తాము అన్ని దేశాల క్రికెట్ బోర్డులతోనూ, ఐసీసీతోనూ చర్చించామని వెల్లడించారు. తద్వారా ఐపీఎల్ కు అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రీడాకారులు అందుబాటులో ఉండేందుకు మార్గం సుగమం అయిందని జై షా తెలిపారు. అంతేకాదు, వచ్చే సీజన్ నుంచి మహిళల ఐపీఎల్ కూడా తమ ప్రాధాన్యతాంశమని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

తర్వాతి కథనం
Show comments