సరికొత్త హోదాను దక్కించుకున్న ఐపీఎల్

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (14:09 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజాగా మరో అరుదైన హోదాను సొంతం చేసుకుంది. పది బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను దాటేసి డెకాకార్న్ హోదాను దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ విలువ బ్రాండ్ విలువ 10.7 బిలియన్ డాలర్లు అంటే సుమారుగా రూ.83353 కోట్లుగా ఉంది. 2022 (8.4 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే ఆ విలువ 28 శాతం పెరిగింది. ఇక ఐపీఎల్ ఆరంభమైన 2008తో పోలిస్తే ఏకంగా 433 శాతం వృద్ధి ఉంది. బ్రాండ్ విలువను లెక్కగట్టే సంస్థ బ్రాండ్ ఫినాన్స్ వీల్స్ ఈ నివేదికను వెల్లడించింది. 
 
మీడియా హక్కుల కింద 6.2 బిలియన్ డాలర్లు (రూ.48,390 కోట్లు) రావడం, రెండు ఫ్రాంచైజీలు కొత్తగా చేరడం, కొవిడ్ తర్వాత స్టేడియాలు పూర్తిగా నిండటం తదితర కారణాలతో బ్రాండ్ విలువ పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇక ప్రాంఛైజీల విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ 87 మిలియన్ డాలర్లు (సుమారు రూ.725 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ 81 మిలియన్ డాలర్లు (రూ.675 కోట్లు), కోల్ కతా నైట్ రైడర్స్ 78.6 మిలియన్ డాలర్లు (రూ.655 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 69.8 మిలియన్ డాలర్లు (రూ.581 కోట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 
 
వింత ఆచారం... అక్కడ తల్లీకూతుళ్లిద్దరికీ భర్త ఒక్కరే...  
 
సాధారణంగా వివాహం అంటే రెండు మనసుల కలయిక. ఇరు కుటుంబాల కలయిక. అయితే, ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా తెలిసిన వారు, బంధువులు సంబంధాల కంటే పరిచయం లేని వ్యక్తులు, దూరపు సంబంధాల్నే చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే, కొన్ని సందర్భాల్లో కొందరు రక్త సంబంధాలు, మేనరికం పేరుతో బావ లేదా మేనమామను పెళ్లి చేసుకుంటారు. కానీ కూతురే కన్న తండ్రిని వివాహం చేసుకోవడం ఎక్కడైనా చూశారా? తల్లీకూతుళ్లిద్దరికీ భర్త ఒక్కరే అన్న వింత గురించి మీరెప్పుడైనా విన్నారా? ఈ మాట వింటుంటే చెవుల్లో సీసం పోసినట్టుగా ఉంది కదా. ఈ కంఠోరంగా ఉన్న ఈ విడ్డూరాన్ని ఓ తెగ ప్రజలు ఆచారంగా పాటిస్తుంది. ఇంతకీ ఆ తెగ ఎక్కడుంది... వారి సంప్రదాయం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఏంటి అనేది పరిశీలిస్తే, 
 
బంగ్లాదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతాల్లో నివశించే ప్రాచీన తెగల్లో మండి తెగ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి భాష, ఆచార వ్యవహారాలు ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉండటం గమనించవచ్చు. కన్న కుమార్తెను తండ్రే పెళ్లి చేసుకునే పద్దతి కూడా ఇందులో ఒకటి. ఈ క్రమంలో ఊహ తెలియని వయసులోనే అమ్మాయిలకు తమ తండ్రులతో వివాహం చేసినా, 15 యేళ్లనేళ్ళు నిండిన తర్వాత కాపురం చేయిస్తారట. ఇలా ఈ తెగలో తల్లీబిడ్డలిద్దరికీ భర్త ఒక్కరే ఉంటారన్నమాట. 
 
ఒకవేళ భర్త చనిపోతే అదే తెగకు చెందిన ఓ వ్యక్తి ముందు తల్లిని పెళ్లి చేసుకోవడం, ఆమె సంతానాన్ని తమ సొంత పిల్లలుగా చూసుకోవడం ఈ తెగ వాసుల ఆచారం. ఇక ఈ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే సవతి తండ్రిని పెళ్లి చేసుకోవాలన్న నిబంధన కూడా ఉంది. ఈ మాట వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ మండి తెగ ప్రజలు మాత్రం ప్రాచీన కాలం నుంచే పాటిస్తున్నట్టుగా అక్కడి వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

తర్వాతి కథనం
Show comments