వారం రోజుల పాటు ఐపీఎల్ నిలిపివేత : బీసీసీఐ ప్రకటన

ఠాగూర్
శుక్రవారం, 9 మే 2025 (16:18 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2025 పోటీలను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 
 
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, పాకిస్థాన్ సాయుధ బలగాల దుందుడుకు చర్యలు, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
క్రికెట్ మన దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన క్రీడ అయినప్పటికీ దేశ సార్వభౌమాధికారం సమగ్రత, భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదని, బీసీసీఐ నొక్కి చెప్పింది. భారతదేశాన్ని రక్షించే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాడానికి బీసీసీఐ కట్టుబడివుందని, ఎల్లపుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. 
 
ఈ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలిపి, అర్థం చేసుకున్నందుకు లీగ్ అధికారిక ప్రసారదారు జియోస్టార్‌కు బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. అలాగే, టైటిల్ స్పాన్సర్ టాటా, ఇతర అనుబంధ భాగస్వాములు, వాటాదారులకు కూడా దేశ ప్రయోజనాలను అన్నింటికంటే ఉన్నతమైనవిగా భావించి, ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: 24మంది మృతి- తీవ్రగాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం (video)

Beaver Moon 2025: నవంబరులో సూపర్‌మూన్ ఎప్పుడొస్తుందంటే?

భర్త ఆమెకు భరణం ఇవ్వనక్కర్లేదు.. ఉద్యోగం చేసుకుని బతకగలదు.. తెలంగాణ హైకోర్టు

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం- 17మంది మృతి.. ఆర్టీసీ బస్సులు లారీ ఢీకొనడంతో.. (video)

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments