17 యేళ్ళ తర్వాత చెన్నైను సొంత గడ్డపై చిత్తు చేసిన బెంగుళూరు

ఠాగూర్
శనివారం, 29 మార్చి 2025 (00:02 IST)
ఐపీఎల్ 18వ సీజన్ పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నైలోని చెప్పాక్కం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు చిత్తు చిత్తుగా ఓడిపోయింది. పైగా చెన్నైను వారి సొంత మైదానంలో ఆర్సీబీ జట్టు 17 యేళ్ల తర్వాత ఓడించింది. ఈ మ్యాచ్‌లో 197 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
చెన్నై జట్టులో రచిన్ రవీంద్ర 41, రాహుల్ త్రిపాటి 5, దీపక్ హుడా 4, సామ్ కరన్ 8, శివమ్ దూబే 19, కెప్టెన్ రుతురాజ్ 0 చొప్పున పరుగులు చేశారు. బెంగుళూరు బౌలర్లలో జోష్ హేజల్ వుడ్ 3, యశ్ దయాల్ 2, లివింగ్‌స్టోన్ 2 చొప్పున, భువనేశ్వర్ ఒక వికెట్ చొప్పున తీశారు. 
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్ 51 అర్థ సెంచరీతో రాణించగా, పిల్ సాల్ట్ 32, విరాట్ కోహ్లీ 31 చొప్పున పరుగులు చేసి మంచి సుభారంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్‌‍లోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫలితంగా ఆ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

తర్వాతి కథనం
Show comments