ఐపీఎల్ 2025 : చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ హైలెట్స్

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (12:09 IST)
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 
 
గత రెండు మ్యాచ్‌లలో తక్కువ స్కోరుకు ఔటైన ఈ లెఫ్ట్ బ్యాండ్ ఆటగాడు... గౌహతిలో మాత్రం రెచ్చిపోయాడు. కేవలం 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో పది ఫోర్లు, ఐదు భారీ సిక్స్‌లు ఉన్నాయి. నితీశ్ రాణా చేసింది 81 పరుగులే అయినప్పటికీ అందో 70 పరుగులు కేవలం బౌండరీలు, సిక్సర్ల ద్వారా రావడం గమనార్హం. అలాగే, సంజూ శాంసన్ 20, రియాన్ పరాగ్ 37, హెట్మెయర్ 19 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సివుండగా, ఆర్ఆర్ బౌలర్ సందీప్ శర్మ కట్టడి చేయడంతో 13 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆరు పరుగుల తేడాతో చెన్నై జట్టు ఓడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

తర్వాతి కథనం
Show comments