Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీ పేలవంగా ఉంది : వీరేంద్ర సెహ్వాగ్

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (12:19 IST)
ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం పేలవంగా ఉందని భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేజేతులా ఓడిన విషయం తెల్సిందే. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించారు. 
 
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ చేసిన పొరపాట్లు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని సెహ్వాగ్‌ తెలిపాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ తుషార్‌ దేశ్‌పాండేను ధోని ఉపయోగించిన విధానాన్ని సెహ్వాగ్‌ తప్పుబట్టాడు. 'భారీగా పరుగులిచ్చిన తుషార్‌తో కాకుండా మొయిన్‌ అలీతో ధోని మధ్యలో ఒక ఓవర్‌ వేయించాల్సిందన్నారు.
 
ముఖ్యంగా, ధోని తరుచుగా ఇలాంటి పొరపాట్లు చేస్తాడని ఆశించరు. కానీ కుడిచేతి వాటం బ్యాటర్లు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఆఫ్‌ స్పిన్నర్‌తో బౌలింగ్‌ చేయించి ఫలితం రాబట్టాల్సింది'  అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. దేశవాళీ క్రికెట్లో పాత బంతితో బౌలింగ్‌ చేసే తుషార్‌తో ఆరంభంలో ఓవర్లు వేయించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని భారత మాజీ బ్యాటర్‌ మనోజ్‌ తివారి అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments