Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

Webdunia
ఆదివారం, 21 మే 2023 (19:53 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆదివారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై జట్టు విజయభేరీ మోగించింది. ప్రత్యర్థి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ జట్టుతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
హైదరాబాద్‌ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించింది. కామెరూన్‌ గ్రీన్ 47 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్స్‌ల సాయంతో సరిగ్గా వంద పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 
 
అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 56 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో రాణించాడు. సూర్యకుమార్‌ యాదవ్ 16 బంతుల్లో 4 ఫోర్లతో సాయంతో 25 (నాటౌట్)గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, మయాంక్ దగార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 83 పరుగులు చేయగా, వివ్రాంత్ శర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 పరుగులు చేసి రాణించారు. అలాగే, క్లాసెన్ (18) పరుగులు చేయగా..  గ్లెన్‌ ఫిలిప్స్‌ (1), బ్రూక్‌ (0)లను నిరాశపరిచారు. సన్వీర్ సింగ్ (4), మార్‌క్రమ్ (13) నాటౌట్‌గా నిలిచారు. ముంబై బౌలర్లలో ఆకాశ్‌ మధ్వల్ 4, జోర్డాన్‌ ఒక వికెట్ పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments