ఐపీఎల్ 15 : లక్నోపై బెంగుళూరు విజయం

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (07:46 IST)
ఐపీఎల్ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు 18 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆ తర్వాత 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగుళూరు జట్టు 18 పరుగుల తేడాతో గెలుపొందింది. 
 
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగుళూరు జట్టు మొదటి రెండు వికెట్లను ఏడు పరుగులకే కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత 62 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే, కెప్టెన్ డుప్లెసిస్ సమయోచితంగా ఆడారు. సహచరులు ఒక్కొక్కరూ వెనుదిరుగుతున్నప్పటికీ క్రీజ్‌లో పాతుకునిపోయాడు. 
 
ఫలితంగా 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిర్సర్ సాయంతో 23 పరుగులు చేశారు. షాబాజ్ అహ్మద్ 22 బంతుల్లో ఓ ఫోర్ సాయంతో 26 పరుగులు చేశారు. కెప్టెన్ డుప్లెసిస్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 181 పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన లక్నో జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ 30, కృనాల్ పాండ్య 42, స్టోయినిస్ 24 మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేక పోయారు. దీంతో 18 పరుగుల తేడాతా ఓడిపోయింది. ఈ జట్టులో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో మూడింటిలో ఓడింది. బెంగుళూరు జట్టు ఐదో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

తర్వాతి కథనం
Show comments