Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ జట్టులో కరోనా కలకలం - మరో ఆటగాడికి పాజిటివ్

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (13:16 IST)
స్వదేశంలో ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఆటగాళ్లను మాత్రం కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరో ఆటగాడికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ జట్టు సభ్యులను క్వారంటైన్‌కు పంపించారు. 
 
నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మంగళవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడాల్సివుంది. ఈ లోపే ఆ జట్టులోని ఓ ఆటగాడికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో తేలింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం జట్టును ముంబైలో క్వారంటైన్స్‌కు తరలించారు. అయితే, ఆర్టీపీసీ పరీక్ష ద్వారా కూడా కరోనా పాజిటివ్ ఉందా లేదా అని నిర్ధారణ చేయనున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
గత శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హార్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్టు బయటపడడం తెలిసిందే. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ కరోనా వైరస్ కేసులు వెలుగు చూడడంతో 2020లోనూ ఐపీఎల్ సగంలో ఆగిపోవడం గుర్తుండే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు క్వారంటైన్ కాలం 3-4 రోజులకు తగ్గిపోయింది. కనుక మరొక రోజు అయినా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహణకు అవకాశాలు ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments