Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ వాయిదా : అభిమానుల వీడ్కోలు మధ్య స్వస్థలానికి ధోనీ

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (13:08 IST)
స్వదేశంలో ఈ నెల 29వ తేదీన నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ జరగాల్సివుంది. అయితే, కరోనా వైరస్ భయం కారణంగా ఈ టోర్నీని ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదావేశారు. దీంతో ఇప్పటివరకు ప్రాక్టీస్‌లో నిమగ్నమైవున్న క్రికెటర్లు తమతమ స్వస్థాలకు వెళ్లిపోతున్నారు. 
 
నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ కోసం రెండు వారాల ముందునుంచే ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. ఈ ప్రాక్టీస్‌లో జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా పాల్గొన్నారు. ఐపీఎల్ టోర్నీ వాయిదాపడటంతో ధోనీ తన స్వరాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. 
 
వాస్తవానికి ఐపీఎల్ పోటీలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కావాల్సివుండగా, వాటిని ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అప్పుడన్నా ప్రారంభమవుతాయా? అన్న విషయంపైనా సందేహాలు నెలకొనివున్నాయి.
 
ఈ నేపథ్యంలో చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం, ప్రాక్టీస్ సెషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ధోనీ సహా, జట్టులో కీలక ఆటగాళ్లయిన సురేశ్ రైనా, అంబటి రాయుడు వంటి వారు స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి చిన్న వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
 
ఇందులోభాగంగా చెపాక్ స్టేడియంలో కాసేపు గడిపిన ధోనీ, ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు సెల్ఫీలు ఇస్తూ సరదాగా కాలం గడిపాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐపీఎల్‌పై స్పష్టత వచ్చిన తర్వాతనే ధోనీ తిరిగి చెన్నైకి వస్తారని ప్రకటించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments