Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : టీమిండియాకు భారీ షాక్!

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (09:06 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. బుధవారం నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. బుధవారం న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్లు, గురువారం భారత్ - ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. 
 
అయితే, సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడడు. కుడిచేయికి గాయమైంది. అయితే, గాయం తీవ్రతను మాత్రం వెల్లడించలేదు. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన వెంటనే రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ నిలిపివేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ ఫోటోలు కుడి చేయికి గాయమైనట్టుగా కనిపిస్తుండగా, ఐస్ ప్యాక్‌తో మర్థన చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన నొప్పితోనే బాధపడుతున్నట్టు ఈ ఫోటోలను చూస్తే ఇట్టే గ్రహించవచ్చు. అయితే, ఈ గాయంపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ నెల 10వ తేదీన ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత తలపడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments