Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : టీమిండియాకు భారీ షాక్!

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (09:06 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. బుధవారం నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. బుధవారం న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్లు, గురువారం భారత్ - ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. 
 
అయితే, సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడడు. కుడిచేయికి గాయమైంది. అయితే, గాయం తీవ్రతను మాత్రం వెల్లడించలేదు. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన వెంటనే రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ నిలిపివేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ ఫోటోలు కుడి చేయికి గాయమైనట్టుగా కనిపిస్తుండగా, ఐస్ ప్యాక్‌తో మర్థన చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన నొప్పితోనే బాధపడుతున్నట్టు ఈ ఫోటోలను చూస్తే ఇట్టే గ్రహించవచ్చు. అయితే, ఈ గాయంపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ నెల 10వ తేదీన ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత తలపడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments