Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (16:08 IST)
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టంచారు. ఈ క్రీడల్లో ఏకంగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలోని మహిళా క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. దీంతో ఈ యేడాది జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు రెండు బంగారు పతకాలను చేసుకున్నట్టయిది. అలాగే, ఇప్పటివరకు అన్ని విభాగాల్లో కలిపి భారత ఆటగాళ్లు 11 పతకాలను కైవసం చేసుకున్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత మహిళా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. జట్టులో స్మృతి మందనా 46, జెమీమా రోడ్రిగ్స్ 42 చొప్పున పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత 117 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 97 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో టిటాస్ సాధు 4 ఓవర్లు వేసి ఆరు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. మరో బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ కూడా రెండు వికెట్లు తీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

తర్వాతి కథనం
Show comments