Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ - పాయింట్ల పట్టికలో..

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (12:17 IST)
స్వదేశంలో పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరిగిన ట్వంటీ20 సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పాయింట్ల జాబితాలో భారత్ ఖాతాలో 269 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత భారత్ టీ20 ర్యాంకుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు 2016లో ఫిబ్రవరిలో చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ అగ్రస్థానంలో నిలించింది. 
 
ఇదిలావుంటే, స్వదేశంలో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లలో భారత్ వరుసగా విజయాలను సాధిస్తుంది. గతంలో బంగ్లాదేశ్‌పై 2-1, వెస్టిండీస్‌పై 2-1, శ్రీలంకపై 2-0, ఇంగ్లండ్‌పై 3-2, న్యూజిలాండ్‌‍పై 3-0, వెస్టిండీస్‌పై 3-0 తేడాతో వరుసగా ఆరు సిరీస్‌లను భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఇదిలావుంటే, గురువారం నుంచి శ్రీలంక జట్టుతో స్వదేశంలో మరో ట్వంటీ20 సిరీస్‌ను ఆడనుంది. 
 
మరోవైపు, ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 184 పరుగులుచేసింది. సూర్యకుమార్ మెరుపులు మెరిపించి 65 పరుగులు చేశాడు. ఆ తర్వాత 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ ట్వంటీ20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

తర్వాతి కథనం
Show comments