Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులెత్తేసిన భారత బౌలర్లు .. సిమ్మన్స్ వీరవిహారం.. విండీస్ విజయం

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (09:51 IST)
తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు లెండల్ సిమ్మన్స్ బ్యాట్‌తో వీరవిహారం చేయడంతో మరో 9 బంతులు మిగిలివుండగానే, 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ 1-1 తో సమమైంది. 
 
తొలుత ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ చేసింది. యువ ఆటగాడు శివమ్‌ దూబే అర్థ సెంచరీ(54), రిషభ్‌ పంత్‌ 33 పరుగులతో ఆకట్టుకొని, భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోరును సాధించిపెట్టగా, మిగితా బాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసింది. భారత ఆటగాళ్లలో రోహిత్ 15, రాహుల్ 11, దూబే 54, కోహ్లీ 19, పంత్ 33 (నాటౌట్), శ్రేయాస్ 10, జడేజా 9, సుందర్ 0, చాహర్ 1 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు మరో 9 బంతులు మిగిలివుండగానే, 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఆ జట్టులో సమ్మన్ 67 (నాటౌట్), లూయిస్ 40, హెట్‌మయెర్ 23, పూరన్ 38 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. 
 
ఫలితంగా 18.3 ఓవర్లలో 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కాగా, సిరీస్ ఫలితాలన్ని తేల్చే మూడో వన్డే మ్యాచ్ ఈ నెల 11వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments