Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మశాల వన్డే : శ్రీలంక ఘన విజయం

ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పేలవప్రదర్శన కారణంగా కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది.

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (17:28 IST)
ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పేలవప్రదర్శన కారణంగా కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 20.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు 114 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. 
 
కాగా, ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు అత్యంత ఘోరంగా విఫలమైంది. 27 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వికెట్ కీపర్ ధోనీ మరోమారు ఆపద్బాంధువుడి పాత్రను పోషించారు. 
 
ఫలితంగా 38.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయిన భారతజట్టు 112 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (2), ధావన్ (0), ఎస్ఎస్ అయ్యర్ (9), కార్తీక్ (0), ఎంకే పాండే(2), పాండ్యా (10), భువనేశ్వర్ కుమార్ (0), కులదీప్ యాదవ్ (19), ధోనీ (65), బుమ్రా (0), ఒక్క పరుగు కూడా చేయని చాహల్ నాటౌట్‌గా నిలిచాడు.
 
స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. 20.4 ఓవర్లలో శ్రీలంక జట్టు మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. గుణతిలకా (1), తరంగ (49), తిరుమనే (0), మ్యాథ్యూస్ 25, డిక్ వెలా 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

తర్వాతి కథనం
Show comments