Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచి టెస్ట్ మ్యాచ్ : ఓపెనర్ రోహిత్ ఖాతాలో రికార్డు.. తొలి ద్విశతకం

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (12:32 IST)
రాంచి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ మరోమారు రెచ్చిపోయాడు. టెస్టుల్లో ఓపెన‌ర్‌గా ప్ర‌మోష‌న్ పొందిన రోహిత్... వ‌చ్చిన అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సిరీస్‌లో రెండు శ‌త‌కాలు బాదిన రోహిత్ మూడో టెస్ట్‌లో మ‌రో సెంచ‌రీ చేశాడు. 
 
అయితే వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీల‌తో మోత మోగించిన రోహిత్ టెస్టుల్లోనూ తొలి ద్విశ‌త‌కం న‌మోదు చేసాడు. ఇదే ఆయ‌నకి టెస్టుల్లో అత్యుత్త‌మ స్కోరు. ఒక‌వైపు వికెట్స్ ప‌డుతున్న‌ప్ప‌టికి ఎంతో ఓపిక‌గా ఆడుతూ వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ 248 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇందులో 28 ఫోర్స్‌, 5 సిక్స్‌లు ఉన్నాయి. 
 
కాగా, రాంచీ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో భార‌త్ నాలుగు వికెట్స్ కోల్పోయి 363 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో రోహిత్‌, జ‌డేజా ఉన్నారు. అంతకముందు ర‌హానే 2016 త‌ర్వాత హోమ్ గ్రౌండ్‌లో తొలి సెంచ‌రీ చేశాడు. రోహిత్‌తో క‌లిసి 267 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments