Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాకు ఓటమి ఖాయం.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (13:31 IST)
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆటలో భాగంగా నాలుగో రోజైన ఆదివారం వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఫాలోఆన్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 21 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
 
ఉమేశ్‌యాదవ్‌ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతి లెగ్‌సైడ్‌ వెళ్లినా డిబ్రుయిన్‌(8) షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్‌కు తగిలిన బంతి వికెట్ల వెనుక నుంచి దూరంగా వెళుతున్న క్యాచ్‌ను సాహా తనదైన మార్కుతో అందుకున్నాడు. డైవ్ చేసి మరీ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్‌తో వృద్ధిమాన్ సాహా అందరినీ ఆశ్చర్యపరిచాడు.
 
అలాగే 24వ ఓవర్‌లో కెప్టెన్‌ డుప్లెసిస్‌(5)ను పెవిలియన్‌కు పంపాడు. అశ్విన్‌ వేసిన 24 ఓవర్‌ మూడో బంతి డుప్లెసిస్‌ బ్యాట్‌కు తగిలింది. ఆ సమయంలో వికెట్లకు దగ్గరగా ఉన్న సాహా చేతుల్లోంచి బంతి చేజారిపోయిందని అనిపించింది. అయితే, తక్కువ ఎత్తులో వచ్చిన బంతి తన చేతుల్లోంచి రెండు సార్లు జారిపోయినా మూడోసారి మాత్రం సాహా ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ క్యాచ్‌తో సాహా అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు.
 
ఫలితంగా పూణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ విరామ సమయానికి దక్షిణాఫ్రికా 27 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. మరోవైపు ఈ టెస్టులో టీమిండియా విజయానికి ఇంకా ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. 
 
కాగా దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 601/5 వద్ద డిక్లేర్డ్‌ చేయడంతో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌లో పడింది. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీయగా, ఇశాంత్, ఉమేశ్ యాదవ్, జడేజాలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు. ఇంకా 246 పరుగులు వెనుకబడి ఉంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments