Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీలో సఫారీలను కుమ్మేశారు... 7 వికెట్లతో ఘన విజయం

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:23 IST)
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా, ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి మొహాలీ వేదికగా రెండో ట్వంటీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది. 
 
ఐఎస్ బృందా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు... నిర్ణీత 20 ఓవర్లోల 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, నవ్‌దీవ్ శైనీలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. లక్ష్య ఛేదనలో తడబడ్డారు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం వీరోచిత పోరాటం చేసి జట్టును గెలిపించాడు. 
 
ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ - ధవాన్‌లు ఇన్నింగ్స్‌ను ఘనంగానే ఆరంభించారు. అయితే 33 పరుగుల వద్ద రోహిత్ శర్మ(12) ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కోహ్లీతో ధవాన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. రెండో వికెట్‌కి వీరిద్దరూ కలిసి 61 పరుగులు వీరిద్దరు జోడించారు. అయితే 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధవాన్ ఔట్ అయ్యాడు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్(4) మరోసారి విఫలమయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఫలితంగా భారత 19 ఓవర్లలో 151 పరుగులు చేసి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీ అందుకున్నాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments