Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో టీ-20 దక్షిణాఫ్రికా గెలుపు.. ధోనీ, పాండే మెరిసినా నో యూజ్

ట్వంటీ-20 సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పుంజుకుంది. క్లాసన్‌ (69) చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో ట్వంటీ-20లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయభేరి మోగించింది. మనీష్‌ పాండే (79 నాట

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (09:37 IST)
ట్వంటీ-20 సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పుంజుకుంది. క్లాసన్‌ (69) చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో ట్వంటీ-20లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయభేరి మోగించింది. మనీష్‌ పాండే (79 నాటౌట్‌), ధోని (52 నాటౌట్‌) మెరిసినా భారత్ గెలుపును నమోదు చేసుకోలేకపోయింది.

ధోనీ, మనీష్ పాండే మెరుగ్గా రాణించడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 4వికెట్లకు 188 పరుగులు సాధించింది. కానీ తదనంతరం క్లాసన్‌తో పాటు డుమిని (64 నాటౌట్) విరుచుకుపడడంతో దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా విజయాన్ని సఫారీల జట్టు తన ఖాతాలో వేసుకుంది.
 
ఇకపోతే.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 11 ఏళ్ల టీ-20 కెరీర్‌లో రెండే అర్థ సెంచరీలు చేశాడు. అయితే బుధవారం దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన రెండో టీ20లో ధోనీ చెలరేగిపోయాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 52 పరుగులు చేశాడు. ధోనీకి ఇది 77వ టీ20 ఇన్నింగ్స్ కావడం గమనార్హం. అయినా రెండో టీ-20లో భారత్ పరాజయం పాలైంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో దక్షిణాఫ్రికా సమం అయింది. సిరీస్ విజయాన్ని తేల్చే చివరి మ్యాచ్ శనివారం కేప్‌టౌన్‌లో జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments