Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై టెస్టు.. క్రీజులో పాతుకుపోయిన మయాంక్ అగర్వాల్

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (11:28 IST)
ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో భార‌త్-న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతోన్న రెండో టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట కొన‌సాగుతోంది. టీమిండియా ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ క్రీజులో పాతుకు పోయి నాలుగు సిక్సులు, 16 ఫోర్ల సాయంతో 143 ప‌రుగులు చేశాడు.
 
అంతకుముందు 221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. కివీస్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్.. ఓకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీసాడు.
 
ఆజాజ్ స్పిన్ ధాటికి వృద్దిమాన్ సాహా తన ఓవర్ నైట్ స్కోర్‌కు 2 పరుగులు మాత్రమే జత చేసి పెవిలియన్ చేరాడు. రెండో రోజు రెండో ఓవర్‌లోనే సాహాను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన ఆజాజ్.. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 
 
ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన అశ్విన్.. గోల్డెన్ డక్‌గా తెల్ల మొహం వేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా కోల్పోయిన 6 వికెట్లను ఆజాజ్ పటేల్ తీయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments