Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో 13 మందికి కరోనా వైరస్.. ఒమిక్రాన్ టెన్షన్‌

Advertiesment
passengers
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (21:30 IST)
Hyderabad
హైదరాబాదులో 13 మందికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి వచ్చిన వారిలో 13 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో 13 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు.

 
పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే వారికి సోకిన కరోనా వేరియంట్‌పై స్పష్టత రావాల్సి ఉంది. రిపోర్ట్స్ వచ్చేందుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు.

 
విదేశాల నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. ఆమె నుంచి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఆమెకు సోకింది కరోనా డెల్టా వేరియంటా.. లేక ఒమిక్రాన్ వేరియంట్ అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాయువేగంతో దూసుకొస్తోన్న జవాద్ తుఫాన్