Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచీ ట్వంటీ20 : టాస్ గెలిచిన రోహిత్ - కివీస్ బ్యాటింగ్

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (19:12 IST)
స్వదేశంలో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్వంటీ 20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాంచీ వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చేశారు.
 
తొలి ట్వంటీ20లో గాయపడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి, పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేన్‌కు అవకాశం కల్పించారు. ఇది ఇతనికి తొలి ట్వంటీ20 మ్యాచ్ కావడం గమనార్హం. 
 
అలాగే, న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు చేశారు. లోకీ ఫెర్గ్యూసన్, రచిన్ రవీంద్ర, టాడ్ ఆసిల్‌లను తప్పించి వారి స్థానంలో ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, జిమ్మీ నిషమ్‌లకు చోటు కల్పించారు. కాగా, తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments