Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హోటళ్ళలో ఫోటోలు తీసిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు?

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (15:46 IST)
క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్ - భారత జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ బర్మింగ్ హామ్ వేదికకానుంది. ఇందుకోసం ఇరు జట్లూ బర్మింగ్ హామ్‌లోని హయత్ రీజెన్సీ హోటల్‌లో బసచేసివుంది. ఈ జట్టుతో పాటు.. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 
 
అయితే, టీమిండియా ఆటగాళ్లు బసచేసిన నక్షత్ర హోటల్‌లో ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి కలకలం సృష్టించారు. ఆటగాళ్లను, వారి కుటుంబసభ్యులను ఫొటోలు తీస్తూ హోటల్‌లో ఇబ్బందికర వాతావరణం సృష్టించారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఆటగాళ్లు ఉంటున్న గదుల చుట్టూ తిరుగుతూ, తీవ్ర అసౌకర్యానికి గురిచేశారు. 
 
దీంతో అప్రమత్తమైన భారత క్రికెట్ జట్టు సభ్యులు మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించగా, మేనేజ్‌మెంట్ వెంటనే స్పందించి హోటల్ యాజమాన్యానికి గట్టిగా ఫిర్యాదు చేసింది. దాంతో, హోటల్ యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగి ఆ ముగ్గుర్ని తీవ్రంగా హెచ్చరించి అక్కడినుంచి పంపించివేసింది. ఈ ఘటన ఆటగాళ్ళలో ఆందోళన రేకెత్తించింది. 

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments