Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో తొలి టెస్టు.. జో రూట్ సెంచరీ.. 200 పరుగులు దాటిన ఇంగ్లండ్

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (16:23 IST)
Joe Root
ఇండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీ కొట్టాడు. ఇది అతనికి వందో టెస్ట్ కావడం విశేషం. 164 బంతుల్లోనే 12 ఫోర్లతో రూట్ మూడంకెల స్కోరు అందుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 20వ సెంచరీ. 
 
63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను సిబ్లీతో కలిసి రూట్ ఆదుకున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 160కిపైగా పరుగులు జోడించారు. అటు సిబ్లీ కూడా సెంచరీ వైపు అడుగులు వేస్తున్నాడు.
 
కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ స్కోరు 200 పరుగులు దాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. అయితే, 63 పరుగుల వద్ద ఓపెనర్లు రోరీ బర్న్స్ (33), డేనియల్ లారెన్స్ (0) అవుటవడంతో జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది.
 
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్.. ఓపెనర్ డొమినిక్ సిబ్లీతో కలిసి ఇన్సింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 74 ఓవర్లు ముగిశాయి. ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. డొమినిక్ 67, రూట్ 94 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

తర్వాతి కథనం
Show comments