Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఎంతో నేర్పింది.. సమిష్టి కృషి ఆకట్టుకుంది: కోహ్లీ

ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా ఎంతో నేర్చుకున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఖాతాలో సరికొత్త రికార్డు సాధించింది.

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (12:38 IST)
ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా ఎంతో నేర్చుకున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఖాతాలో సరికొత్త రికార్డు సాధించింది. 114/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. భారత్‌లో అత్యధిక ఓపెనింగ్  భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇప్పటిదాకా కోహ్లీ నేతృత్వంలో టీమిండియా 18 టెస్టులు ఆడగా, వాటిలో రెండింట మాత్రమే పరాజయం పాలైంది. 
 
అయితే ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా ఒక అమూల్యమైన విషయాన్ని నేర్చుకున్నామని అంటున్నాడు కోహ్లి.  ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఎంతో నేర్పిందని.. జట్టు సమిష్టిగా రాణించిందని కోహ్లీ తెలిపాడు. మ్యాచ్ చివరి రోజు ఆటలో బంతి అనుకున్నదాని కంటే ఎక్కువ టర్న్ అవడమే కాకుండా, బాగా బౌన్స్ కూడా అయినట్లు కోహ్లి స్పష్టం చేశాడు. 
 
ఆ నేపథ్యంలోనే భారత్ తన రెండో ఇన్నింగ్స్ ఆదిలో కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడ్డామని కోహ్లీ తెలిపాడు. అయితే ఈ తరహాలో గేమ్‌ను రక్షించుకోవడం భారత్ జట్టుకు చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తుందన్నాడు. కచ్చితంగా తొలి టెస్టు నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నామని, ప్రధానంగా గేమ్ ను ఎలా కాపాడుకోవాలో బాగా అర్థమైందని చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

తర్వాతి కథనం
Show comments