Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్ ఖాతాలో చెత్త రికార్డు!

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (10:12 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్‌కు తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదురైంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చిత్తు
గా ఓడిపోవడమేకాకుండా, ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 
 
భారత్ నిర్ధేశించిన 371 పరుగులు విజయలక్ష్యాన్ని ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్లుకోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 
 
ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసి ఓటమిపాలైన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ళు ఐదు సెంచరీలు నమోదు చేశారు. రిషభ్ పంత్ (134, 118) రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేయగా, యశస్వి జైశ్వాల్ (101), శుభమన్ గిల్ (147), కేఎల్ రాహుల్ (137)లు శతకాలు చేశారు. 
 
అంతకుముందు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1928/29లో జరిగిన యాషెస్ మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు చేసినప్పటికీ ఆ జట్టు ఓడిపోయింది. డాన్ బ్రాడ్‌మెన్ ఆ మ్యాచ్‌లో తొలి సెంచరీ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేత లాడ్జిలో వ్యభిచారం.. అందమైన యువతులను రప్పించి...

ప్రియుడుతో అక్రమ సంబంధం ఉంది : అంగీకరించిన సోనమ్

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

తర్వాతి కథనం
Show comments