Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వన్డేలో చిత్తుగా ఓడిన భారత్ - సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (07:22 IST)
స్వదేశంలో జరిగిన చెన్నై - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు కైవసం చేసుకున్నారు. బుధవారం చెన్నై వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించి 21 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 269 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 270 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 248 పరుగులకే ఆలౌట్ అయింది. ఓ దశలో హార్దిక్ పాండ్యా 40 పరుగులతో మెరుపులు మెరిపించి, భారత శిబిరంలో ఆశలు రేకెత్తించారు. కానీ, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అద్భతంగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదు. జంపా 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఆస్టన్ అగర్ 2, స్టాయినిస్ 1, షాన్ అబ్బాట్ 1 చొప్పున వికెట్ తీశాడు. 
 
భారత ఇన్నింగ్స్‌లో కోహ్లీ అత్యధికంగా 54 పరుగులు చేయగా, ఓపెనర్ శుభమన్ గిల్ 37, కెప్టెన్ రోహిత్ శర్మ 30, కేఎల్ రాహుల్ 32 చొప్పున పరుగులు చేశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

తర్వాతి కథనం
Show comments