Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వన్డేలో చిత్తుగా ఓడిన భారత్ - సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (07:22 IST)
స్వదేశంలో జరిగిన చెన్నై - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు కైవసం చేసుకున్నారు. బుధవారం చెన్నై వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించి 21 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 269 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 270 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 248 పరుగులకే ఆలౌట్ అయింది. ఓ దశలో హార్దిక్ పాండ్యా 40 పరుగులతో మెరుపులు మెరిపించి, భారత శిబిరంలో ఆశలు రేకెత్తించారు. కానీ, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అద్భతంగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదు. జంపా 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఆస్టన్ అగర్ 2, స్టాయినిస్ 1, షాన్ అబ్బాట్ 1 చొప్పున వికెట్ తీశాడు. 
 
భారత ఇన్నింగ్స్‌లో కోహ్లీ అత్యధికంగా 54 పరుగులు చేయగా, ఓపెనర్ శుభమన్ గిల్ 37, కెప్టెన్ రోహిత్ శర్మ 30, కేఎల్ రాహుల్ 32 చొప్పున పరుగులు చేశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments