Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన ఘనతను సాధించిన రవీంద్ర జడేజా... ఎలైట్ క్లబ్‌లో చోటు!

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (17:36 IST)
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండ్ క్రికెటర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత క్రికెట్ జట్టు తరపున టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మెట్లలో భారత్ తరపున ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకే దక్కింది. ఇపుడు వారి సరసన రవీంద్ర జడేజా కూడా చేరాడు. 
 
టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్లలో భారత్‌ తరపున 50, అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌గా జడేజా ఎలైట్‌ క్లబ్‌లో చేరాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సరసన జడ్డూ నిలువడం విశేషం. జడేజా ఇప్పటివరకు 50 టెస్టులు, 168 వన్డేలు, 50 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా ధోనీ, కోహ్లీతో దిగిన ఫొటోలను జడేజా ట్విటర్లో షేర్‌ చేశాడు.
 
అలాగే, తనకు ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచి, సహకరించిన బీసీసీఐ, సహాయక సిబ్బందికి ధన్యవాదాలంటూ పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో బ్యాట్‌, బంతితో రాణించిన జడేజా టెస్టుల్లో 15వ అర్థశతకం సాధించాడు. 2004లో అరంగేట్రం చేసిన ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. మరోవైపు కోహ్లీ 87 టెస్టులు, 251 వన్డేలు, 85 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments